ఇటీవల ఈసీ వేటు వేసిన సిద్దిపేట ఉద్యోగులకు హైకోర్టులో ఊరట..
హైదరాబాద్: ఏప్రిల్ 19 (హింస): ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే అభియోగాలతో సిద్దిపేటకు చెందిన 106 మంది ఐకేప
ఇటీవల ఈసీ వేటు వేసిన సిద్దిపేట ఉద్యోగులకు హైకోర్టులో ఊరట..


హైదరాబాద్: ఏప్రిల్ 19 (హింస): ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే అభియోగాలతో సిద్దిపేటకు చెందిన 106 మంది ఐకేపీ, డీఆర్డీఏ ఉద్యోగులు సస్పెన్షన్ కు గురి కాగా వారికి తెలంగాణ హైకోర్టులో నేడు ఊరట లభించింది. ఎలక్షన్ కమిషన్ విధించిన సస్పెన్షన్ ను ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేయగా.. వారందరినీ తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో ఉపాధి హామీ, సెర్చ్ ఉద్యోగులు పాల్గొన్నారనే అభియోగాలతో ఈసీ ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్ ఒకే రోజు 106 మందిపై సస్పెన్షన్ వేటు వేయగా.. ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో వారందరూ వెంటనే తమ తమ డ్యూటీలలో చేరనున్నారు.

హిందుస్థాన్ సమాచార్ రంజిత్ కుమార్


 rajesh pande