బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు..
చతిస్గడ్: ఏప్రిల్ 19 (హిం.స) చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చి
బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు..


చతిస్గడ్: ఏప్రిల్ 19 (హిం.స) చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిక్కా గ్రామ సమీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండంట్ తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్ ఎన్నికల డ్యూటీలో ఉండగా ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడ్డ జవాన్ను బైరామ్గ ర్ల్ ఆస్పత్రికి తరలించినట్లు బీజాపూర్ పోలీసులు పేర్కొన్నారు.

ఐఈడీ పేలుడు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు. లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande