కర్నూలు జిల్లా19.ఏప్రిల్ (హిం.స(: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయ యాత్ర చేయనున్నారు. ఆలూరు (Alur)లో ఉదయం పది గంటలకు ఆమె కాంగ్రెస్ (Congress) శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఆదోనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆరు గంటలకు ఎమ్మిగనూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం షర్మిల కడపకు బయలుదేరి వెళతారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్