ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మెదక్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఏప్రిల్ 20 (హిం.స) పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మెదక్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్: ఏప్రిల్ 20 (హిం.స)

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సిఎం హాజరుకానున్నారు. మెదక్ ర్యాలీ తర్వాత కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి కొండా సురేఖ, హనుమంతరావు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో ప్రచారంలో దూకుడు పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ నిన్న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు.

మహబూబ్నగర్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి

వంశీచందొడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande