సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను
దిల్లీ, 20 ఏప్రిల్ (హిం.స): సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరా
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను


దిల్లీ, 20 ఏప్రిల్ (హిం.స): సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా మూడు దశల్లో నిర్వహించే ఈ పరీక్ష మొత్తంగా 2025 మార్కులకు జరుగుతుంది. మొదటి ర్యాంకు సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ 1099 మార్కులు (రాత పరీక్షలో 899, ఇంటర్వ్యూలో 200) సాధించినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. రెండో ర్యాంకు సాధించిన అనిమేశ్ ప్రధాన్ 1067 మార్కులు (రాత పరీక్షలో 892, ఇంటర్వ్యూలో 175), మూడో ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి 1065 మార్కులు (రాత పరీక్షలో 875, ఇంటర్వ్యూలో 190) పొందినట్లు పేర్కొంది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande