ఖమ్మం సీట్ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నిరాశ.. సతీమణి నందిని కి దక్కని టిక్కెట్టు
ఖమ్మం ఏప్రిల్ 23 (హిం.స) లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తికరంగా
ఖమ్మం సీట్ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నిరాశ.. సతీమణి నందిని కి దక్కని టిక్కెట్టు


ఖమ్మం ఏప్రిల్ 23 (హిం.స)

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సినిమా హీరో విక్టరీ వెంకటేశ్లకు వియ్యంకుడు అయిన రఘురామ రెడ్డి పేరుని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందినీ కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తన కొడుకు యుగంధర్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం రఘురామ రెడ్డి వైపే మొగ్గుచూపింది.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande