ఎమ్మెల్సీ కవితకు షాక్.. జ్యూడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడగింపు
న్యూఢిల్లీ ఏప్రిల్ 23 (హిం.స) ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వక
ఎమ్మెల్సీ కవితకు షాక్.. జ్యూడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడగింపు


న్యూఢిల్లీ ఏప్రిల్ 23 (హిం.స)

ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన కవిత తీహార్ జైలులో జ్యుడీషయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ఆమె కస్టడీ నేటితో ముగుస్తుండటంతో.. కోర్టు ముందు వర్చువల్గా హాజరయ్యారు. కాగా.. ఈడీ అధికారులు, కవిత తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. జ్యుడీషల్ కస్టడీని మరో 14 రోజుల పొడిగిస్తూ.. తీర్పునిచ్చింది. కాగా కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande