కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూసేవారు.. ప్రధాని మోదీ ఆవేదన
రాజస్థాన్ ఏప్రిల్ 23 (హిం.స)కాంగ్రెస్ హయాంలో 'హనుమాన్ చాలీసా' వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల
కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూసేవారు.. ప్రధాని మోదీ ఆవేదన


రాజస్థాన్ ఏప్రిల్ 23 (హిం.స)కాంగ్రెస్ హయాంలో 'హనుమాన్ చాలీసా' వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థాన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది తొలిసారిగా 'రామనవమి' సందర్భంగా రాష్ట్రంలో శోభా యాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు. టాంక్-సవాయ్ మథోపూర్లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, హనుమాన్ చాలీసా నిత్య పారాయణం చేసే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రామనవమిని కాంగ్రెస్ నిషేధించిందని అన్నారు.

హనుమాన్ జయంతి గురించి ఈరోజు

మాట్లాడాలనుకున్నప్పుడు కొద్ది రోజుల క్రితం నాటి ఒక ఫోటో తనకు గుర్తుకు వచ్చిందని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇటీవల ఒక వ్యాపారి తన దుకాణంలో కూర్చొని హనుమాన్ చాలీసా వింటుండగా కొందరు వ్యక్తులు అతిదారుణంగా అతన్ని చితకబాదారని గుర్తుచేశారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande