కాకినాడ: 23 ఏప్రిల్ (హిం.స)జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ బయలుదేరారు. ఇంటి నుంచి గౌలలప్రోలు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి వద్దకు చేరుకొని.. అక్కడ నుంచి ర్యాలీగా గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, మండలపరిషత్, తహసీల్దారు కార్యాలయాలు, బస్టాండు మీదుగా పిఠాపురం పట్టణంలోని ప్రవేశించనున్నారు. పశువుల సంత, ఆర్టీసీ కాంప్లెక్స్, చర్చి సెంటర్, ఉప్పాడ సెంటర్, పాతబస్టాండు, అంబేద్కర్ సెంటర్, ప్రభుత్వాను పత్రి సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పిఠాపురం మండలపరిషత్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినే షన్ పత్రాలు అందజేస్తారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్