, అమరావతి:23 ఏప్రిల్ హిం.స) తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇటీవల వరకు గ్రూప్లో వైకాపా ఎన్నికల ప్రచార చిత్రాలను పోస్టు చేశారు. తామేం తక్కువ కాదన్నట్లు వైకాపా అనుకూల యూనియన్ నేతలు కూడా పోటీపడి ఇందులో పోస్టులు పెడుతున్నారు. ఈ గ్రూప్లో ఉన్న ఆర్టీసీ అధికారులు కనీసం అభ్యంతరం చెప్పడం కానీ, దీని నుంచి బయటకు రావడం కానీ చేయకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని తెలిసినా ఎవరూ నోరుమెదపడం లేదు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్