విజయవాడ: 23 ఏప్రిల్ (హిం.స)అవనిగడ్డలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని అన్నదానం హాలు సీలింగ్ ఒక్కసారిగా విరిగిపడింది. నాణ్యత ప్రమాణాల లోపం కారణంగానే సీలింగ్ కూలిందని భక్తులు, స్థానికులు అంటున్నారు. నాలుగు నెలల క్రితమే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అట్టహాసంగా అన్నదానం హాలుని ప్రారంభించారు. నిజానికి ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో భక్తులెవరూ హాలులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్