సమావేశాలకు, ప్రచారానికి అనుమతులు తప్పనిసరి
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:23(హిం స)పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలకు, సమావేశాలకు అనుమతులు తప
*సమావేశాలకు, ప్రచారానికి అనుమతులు తప్పనిసరి*


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:23(హిం స)పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలకు, సమావేశాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని షాద్ నగర్ ఆర్డివో వెంకట మాధవ రావు

సూచించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్, అనుమతులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లకు సంబందించిన వాటిపై మంగళవారం స్థానిక ఆర్డివో కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆర్డివో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలుకు సంబంధించి తేదీలు18న ప్రారంభం కావడం జరిగిందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ 25న ముగుస్తుందని అన్నారు. 26స్కూట్నీ, 29న విత్ డ్రా ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఇక ఎన్నికల సామాగ్రిని మూడు రోజుల తర్వాత పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారాలకు, సమావేశాలకు కచ్చితంగా ప్రతి రాజకీయ నాయకులు,అభ్యర్థులు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎన్నికల సామాగ్రిని వచ్చేనెల 12న ఆయా పోలింగ్ కేంద్రాలకు అందజేయడం జరుగుతుందన్నారు.

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande