చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపిద్దాం.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల ఏప్రిల్ 28 (హిం.స)చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బిసి నాయకుడు కాసాన
చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపిద్దాం.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


చేవెళ్ల ఏప్రిల్ 28 (హిం.స)చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బిసి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వాకర్ను కోరారు. ఆదివారం ఉదయం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు, మంత్రాల చెరువుల వాకింగ్ ట్రాక్ వద్ద చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చేవెళ్లే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీ ల అభ్యర్థులు ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేశారు. కేసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవ చేశారు. ప్రజలు అంత గమనిస్తున్నారని తెలిపారు బిజెపి మతాన్ని పెట్టుకునే ఓటు అడగడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. బిజెపి కేంద్ర నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల అందుబాటులో ఉండే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని తెలిపారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande