అమరావతి 28 ఏప్రిల్ (హిం.స(ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. పోలింగ్కు 15 రోజుల సమయం మాత్రమే ఉంది. రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. సాధారణంగా ఎన్నికల్లో ఒకటి లేదా రెండు రోజుల ముందు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు నోట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి తెరలేపుతుంటారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓట్లుకు నోట్లు పంచడం చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ.. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు నోట్ల పంపిణీకి శ్రీకారం చుడతాయి. ఈసారి వైసీపీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గకపోవడంతో.. కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు ఇప్పటికే పంపకాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్