విజయవాడ:28 ఏప్రిల్ (హిం.స( కేశినేని నాని )ని చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతోందని, రాజకీయాల్లో ఎక్కవ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదేనని, ప్రజారాజ్యం (), టీడీపీ)లను మోసం చేసిన ఆయన వైసీపీ)లో చేరి భజనలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి 9Sujana Choudary), చంద్రబాబు (Chandrababu)పై నోరు పారేసుకుంటున్నారని, పశ్చిమ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తామని సుజనా చెప్పారని, అది అర్ధం చేసుకోకుండా ఈ సిగ్గులేని నాని నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనకు వాళ్ల అమ్మతో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదన్నారు. సోదరుడు పోటీగా నిలబడితే..చెల్లి కూడా నాని ఛాయలకు రావడంలేదన్నారు. ఎవరి ద్వారా లబ్ది, సాయం పొంది.. వారినే తిట్టడం కుశినేని నాని నైజమని, సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకుని తిరిగేవారని, సుజనా ద్వారా ఎంత సాయం పొందారో నాని మరచిపోయారేమో.. మేము దగ్గర ఉండి నాని వేషాలన్నీ చూశామని బుద్ధ వెంకన్న అన్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్