విజయవాడ నేరవార్తలు, 29 ఏప్రిల్ (హిం.స): ఎన్నికల నోటిఫికేషన్కు ముందే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తాయిలాలు ఎరవేసిన వైకాపా.. ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైంది. కుక్కర్ల పంపిణీకి పార్టీ గుర్తుతో కూపన్లు ముద్రిస్తూ, సీ విజిల్ యాప్నకు అందిన ఫిర్యాదుతో దొరికిపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్సింగ్నగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో పెద్దమొత్తంలో కుక్కర్లు ప్యాకింగ్ చేసి ఉన్నాయని ఆదివారం మధ్యాహ్నం సీ విజిల్ యాప్లో ఫిర్యాదు వచ్చింది. ఫ్లైయింగ్ స్క్వాడ్-9 అధికారి డి.రవిచంద్ర సూర్యకుమార్ సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఎక్కడా వస్తువులు కనిపించలేదు. కానీ ప్రెషర్ కుక్కర్, ఫ్యాన్ గుర్తున్న షీట్లు 5,250 దొరికాయి. ఒక్కో షీట్లో 24 కూపన్లున్నాయి. దీనిపై రవిచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్