అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ..
హైదరాబాద్, ఏప్రిల్ 29: (హిం.స) కేంద్రమంత్రి అమిత్ షా కేసులో భాగంగా సీఎం రేవంత్ కు సమన్లు జారీ అయ్యాయ
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ..


హైదరాబాద్, ఏప్రిల్ 29: (హిం.స)

కేంద్రమంత్రి అమిత్ షా కేసులో భాగంగా సీఎం రేవంత్ కు సమన్లు జారీ అయ్యాయి. అయితే ఈ నోటీసులపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైనా నాకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు” అని రేవంత్రెడ్డి తెలిపారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని చెప్పారు. కాగా.. ఈ కేసులో మే 1న హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది. ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. సెక్షన్ 153/153A/ 465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande