వరంగల్: ఏప్రిల్ 29 (హిం.స)
పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ
ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని ఖమ్మం, నల్గొండ,వరంగల్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ ఎంఎల్ సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న
అన్నారు. వరంగల్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు.బిజెపి మెప్పు పొందేందుకు అన్ని స్థానాల్లో కెసిఆర్ డమ్మీ అభ్యర్థులను
నియమించారన్నారు. ఇండియా కూటమి
కేంద్రంలో అధికారంలోకి వస్తే 50 శాతం బిసిలకు రిజర్వేషన్ ఇస్తుందని తెలిపారు. బిజెపికి ఓటేస్తే వన్ నేషన్ కాదు... జీరో ఎలక్షన్ అవుతుంది''
అన్నారు.
రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం