ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు (30-04-2024) అనగా మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు
హైదబాద్ 29 ప్రిల్ (హింస)భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు (30-04-2024) అనగా మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు


హైదబాద్ 29 ప్రిల్ (హింస)భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈరోజు (29-04-2024) హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటన.

లోక్సభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో బిజెపి ఎన్నికల ప్రచారం వడివడిగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు (30-04-2024) అనగా మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. బిజెపి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ బీబీ పాటిల్ గారికి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు గారికి మద్దతుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అల్లాదుర్గ్ లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్-మెదక్ జనసభలో ముఖ్య అతిథిగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొని ప్రసంగించనున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనే విషయాలను మోదీజీ ప్రస్తావించనున్నారు. ఈ సందర్భంగా బిజెపి భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున హాజరై దిగ్విజయం చేయాలని కోరుతున్నాం.

అదే విధంగా మే 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి శ్రీమతి మాధవిలత గారికి మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మే 5వ తేదీన నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో భాగంగా శ్రీ అమిత్ షా గారు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం.

లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు (29-04-2024) కేంద్ర సహాయ మంత్రి శ్రీ మురుగన్ గారితో పాటు చెన్నై (దక్షిణ) లోక్‌సభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి శ్రీమతి తమిళిసై గారు హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande