కడప,30 ఏప్రిల్ (హిం.స): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ) సతీమణి వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా వైసీపీ నేతనే భారతిని నిలదీసిన పరిస్థితి. ఇదంతా జరిగింది కూడా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గంలోనే. పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ పోటోకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.
పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం కుమ్మరాపల్లె భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టదారు పాసుపుస్తకాల్లో సీఎం ఫోటో అంశంపై భారతిని వైసీపీ నేత భాస్కర్ రెడ్డి నిలదీశారు. భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ రెడ్డి ఫోటో వేసుకోవడం తప్పంటూ సీఎం సతీమణికి వైసీపీ నేత తెలిపారు. తాతల కాలం నుంచి రైతుల సొంత భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై ఆ రైతుల ఫోటోలు మాత్రమే ఉండాలని భారతికి భాస్కర్ రెడ్డి సూచించారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్