నారాయణ్పుర్ 30 ఏప్రిల్ (హిం.స(జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ r)లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి.
మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టి.. మంగళవారం ఉదయం నక్సల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగుర్ని మట్టుబెట్టాయి. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరికొందరు నక్సల్స్ పరారయ్యారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్