హైదరాబాద్:39 ఏప్రిల్ (హిం.స( తెలంగాణ పదో తరగతి ఫలితాల)ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు పాసయ్యారు. 99.05 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో..65.10 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 3,927 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్