విజయవాడ:30 ఏప్రిల్ (హిం.స) నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. స్థానికంగా నివాసముంటున్న వైద్యుడు డి.శ్రీనివాస్ ఇంటి బయట ఉరివేసుకోగా.. ఇంటి లోపల ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు కన్పించాయి. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్