జిల్లాలో గడిచిన 24 గంటలలో రూ.46,63,220/- నగదుసీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్, 30 ఏప్రిల్ (హిం.స)ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ
జిల్లాలో గడిచిన 24 గంటలలో రూ.46,63,220/- నగదుసీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్


హైదరాబాద్, 30 ఏప్రిల్ (హిం.స)ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు గడిచిన 24 గంటల వ్యవధిలో 46, లక్షల 63 వేల 220 రూపాయల నగదు, ఒక కోటి 21 లక్షల 01 వేల 867 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 152.49 లీటర్ల మద్యంను పట్టుకొని సీజ్ చేసి,7 మంది పై కేసులు నమోదు చేసి ఐదు మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.ఈ సందర్భంగా నగదు, ఇతర వస్తువుల పై 17 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కారం చేశారు. 8 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారని, లైసెన్స్ గల 41 ఆయుధాలను డిపాజిట్ చేసి నట్లు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 19,67,06,705/- రూపాయల నగదు, 9,43,95,567/- రూపాయల విలువ గల వస్తువులు వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పట్టుకొని సీజ్ చేశారని,21,618.95 లీటర్ల మద్యం ను పట్టుకొని 255 కేసులు నమోదు చేయగా 251 మందిని అరెస్ట్ చేసినట్లు డిఇఓ తెలిపారు.

జిల్లాలో ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా 3 కోట్ల 95 లక్షల 46 వేల 955 రూపాయలు, 28,64,550/- విలువ గల ఇతర వస్తువులు, పట్టుకున్నారని, ఇతర పోలీస్ అథారిటీ/ ఐటి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 15 కోట్ల 45 లక్షల 71 వేల 200 రూపాయల నగదును, 8 కోట్ల 38,లక్షల31 వేల 018 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, ఎస్ఎస్ టి బృందాలు రూ.25,88,550/- నగదు,77 లక్షల విలువైన ఇతర వస్తువులు పట్టుకొన్నారని ఆయన వివరించారు.

ఇప్పటి వరకు నగదు,ఇతర వస్తువుల పై 537 పిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారు.346 మంది పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. 3065 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande