కాకినాడ: 02 మే (*హిం.స)వైసీపీ )కి ఎక్కడికక్కడ దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. గులకరాయి దెబ్బ కూడా దీని ముందు బలాదూరే. గులకరాయితో కొట్టించుకున్నా కూడా వైసీపీకి మైలేజ్ వచ్చే అవకాశమే లేకపోవడంతో నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సామర్లకోటలో వైసీపీకి షాక్ తగిలింది. 100కి పైగా వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. కూటమి అభ్యర్థి చినరాజప్ప.. వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలోనూ.. నియోజకవర్గంలోనూ జగన్ పై ఉన్న వ్యతిరేకత కారణంగానే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. గంజాయి, మత్తు మాఫియా పెట్రేగి పోయి యువతను పెడదోవ పట్టించారన్నారు. కూటమి ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టో బడుగు బలహీనవర్గాలకు మన్ననలు పొందితోందని రాజప్ప తెలిపారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్