మంత్రాలయం గ్రామీణం, 02 ఏప్రిల్ (హిం.స) కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నెలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్థులు, మహిళలు ఆయన్ను తాగునీటి సమస్యపై నిలదీశారు. మూడుసార్లు గెలిపించినా నీటి సమస్య తీర్చలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం మాత్రమే వస్తారు, గెలిచిన తర్వాత పట్టించుకోరని ప్రశ్నించారు. బాలనాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈసారి , ఎన్నికల తర్వాత తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్