ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్
ఢిల్లీ 02,మే ,(హిం.స) మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హైకోర్టులో బెయిల్ పిటిషన్
ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్


ఢిల్లీ 02,మే ,(హిం.స) మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ను నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా తరపు న్యాయవాది ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దరఖాస్తుదారుడు శాసన సభ సభ్యుడిగా ఉన్నారని.. పైగా ఎన్నికల సీజన్ నడుస్తోందని గుర్తుచేశారు. గురువారం మధ్యాహ్నం 12:30 కల్లా పేపర్లు సరిగ్గా ఉంటే.. శుక్రవారం మా దగ్గరకు వస్తుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అన్ని పేపర్లు సరిగ్గా ఉంటే శుక్రవారం విచారిస్తామని తెలిపారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande