జిల్లాలో ఇప్పటి వరకు రూ.21,61,05,505/-నగదు సీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
* *హైదరాబాద్, మే 02:( హిం.స )జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఇప్పటి వరకు రూ.21 కోట్ల 6
జిల్లాలో ఇప్పటి వరకు రూ.21,61,05,505/-నగదు సీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*


*

*హైదరాబాద్, మే 02:( హిం.స )జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఇప్పటి వరకు రూ.21 కోట్ల 61 లక్షల 05 వేల 505/- నగదుతో పాటు 13కోట్ల 82 లక్షల 63 వేల 903 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 26,474.735 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 266 మందిపై కేసులు నమోదు చేసి 262 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై 562 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారని, 364 మంది పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు, లైసెన్సు గల 3073 ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎంసిసి ఉల్లంగనలపై 29 ఫిర్యాదులు అందగా, అన్నింటిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.4 లక్షల నగదు,6,42,634/- రూపాయల విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 58.46 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, 5 కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, 10 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 5,75,58,955/-, పోలీస్,ఐటి శాఖ ద్వారా రూ.15,59,58,000/-,

ఎస్ ఎస్ టి బృందాల ద్వారా రూ.25,88,550/- నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande