లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నాలుగు నియోజకవర్గాలలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన
హైదరాబాద్: మే 4 (హిం.స) లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస ప్రచారాలత
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నాలుగు నియోజకవర్గాలలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన


హైదరాబాద్: మే 4 (హిం.స)

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస ప్రచారాలతో స్పీడ్ పెంచారు. నేడు అనగా శనివారం కొత్తగూడెం, మహబూబ్నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జన జాతర సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట(మహబూబ్ నగర్) కార్నర్ మీటింగ్ కు హాజరుకానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి సీఎం వివరించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలు దూకుడు పెంచారు. పార్లమెంట్ ఎన్నికల

ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande