అమరావతి, 05 మే *హిం.స)టిడిపి ) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ() అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ( సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తీసుకుని సోమవారం నాడు గుంటూరు( సీఐడీ కార్యాలయానికి రావాలంటూ టీడీపీ ఆఫీసుకు సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఐడీకి కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు టీడీపీకి నోటీసులు జారీ చేశారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్