అమరావతి 05 మే (హిం.స)): రాష్ట్రంలో ఉద్యోగుల పోస్టల్ ఓటు హక్కుపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికార పార్టీ తమకు అనుకూలురైన కొందరు ఎన్నికల అధికారుల సాయంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోకుండా గందరగోళం సృష్టిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఎన్నికల సంఘం పదేపదే స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే కొందరు అధికారులు ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవరించారని ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు జిల్లా ఫెసిలిటేషన్ కేంద్రంలో 4న ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పీవోలకు పంపిన ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. తీరా శనివారం ఫెసిలిటేషన్ సెంటర్కు వెళ్లినవారికి చుక్కెదురైంది. ఈ రోజు కాదు... ఎల్లుండి రండి అంటూ అధికారులు చెప్పడంతో వారంతా అక్కడే నిరసన వ్యక్తం చేశారు. కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అభాసుపాలవుతోందని మండిపడుతున్నారు.
హోం ఓటింగ్ ఉద్యోగులపై స్పష్టత ఏదీ?
గుంటూరు జిల్లాలో కొందరు ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులను పీవోలుగానూ, ఇతర ఎన్నికల విధుల్లోనూ నియమించారు. వారికి 5, 6 తేదీల్లో రెండో విడత శిక్షణ ఇస్తారు. అదే ట్రైనింగ్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్
హిందూస్తాన్ సమాచార రాజీవ్