హైదరాబాదు 05 మే (హిం.స)ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల్లో ప్రచారం చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. పార్టీ పాటలతో పాటు, వాట్సాప్లో యువతను గ్రూపులుగా చేర్చి ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోలింగ్కు గట్టిగా పది రోజులు కూడా లేకపోవడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లల్లో పోటీలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్