ఏలూరు, 05 మే (హిం.స(: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు. ఆ క్రమంలో పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అందులోభాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తామంతా నష్టపోతామంటూ సాప్ట్వేర్ ఇంజినీర్ శేషనాయుడు ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్