దేశం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మోడీ ప్రధాని కావాలి.. మాజీ గవర్నర్ తమిళసై
మెదక్ మే 5 (హిం.స)దేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ మోడీ ప్రధాని కావాలనీ మాజీ గవర్నర్ తమిళి సై అన్నారు.
దేశం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మోడీ ప్రధాని కావాలి.. మాజీ గవర్నర్ తమిళసై


మెదక్ మే 5 (హిం.స)దేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ మోడీ ప్రధాని కావాలనీ మాజీ గవర్నర్ తమిళి సై అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం చేసిన తమిళిసై.. మాయా గార్డెన్లో నిర్వహించిన విశేష్ సంపర్క్ అభియాన్లో మేధావుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశానికి బలమైన ప్రధాని కావాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటు వేస్తే ఎవరు ప్రధాని అవుతారో కూడా తెలియదన్న తమిళిసై.. రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande