తెలంగాణలో 12 సీట్లు గెలిచి కాషాయ జెండాను ఎగరవేస్తాం. ఈటెల రాజేందర్
హైదరాబాద్ మే 6 (హిం.స) మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ నుండి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర
తెలంగాణలో 12 సీట్లు గెలిచి కాషాయ జెండాను ఎగరవేస్తాం. ఈటెల రాజేందర్


హైదరాబాద్ మే 6 (హిం.స)

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ నుండి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పై ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నీచపు ప్రచారం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు తీసివేయలేదని ఆయన అన్నారు. అణగారిన వర్గాలకు బీజేపీ పార్టీ పదవులు కట్టబెట్టిందన్నారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలిచి కాషాయ జెండాను ఎగురవేస్తామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande