అభివృద్ధికి పట్టం కట్టండి
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మే 6(హిం.స): పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి ఓటెయ్యాలని పశ్చిమ ఎమ్మెల్యే
అభివృద్ధికి పట్టం కట్టండి


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మే 6(హిం.స): పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి ఓటెయ్యాలని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భార్య ఆడారి మాలతి విజ్ఞప్తి చేశారు. 52 వార్డు పరిధిలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ఆధ్వర్యంలో వుడా కాలనీ ప్రాంతంలో ఆడారి భార్య ఆడారి మాలతి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. ఈ సందర్బంగా వార్డు ప్రజలు అడుగడుగునా నీరజనాలు పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో గత 19 నెలలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అలాగే సేవా కార్యక్రమాల్లో ముందున్న ఆడారి, నియోజకవర్గం లో అనేకమందికి ఇతోధిక సేవలందించారని వివరించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి గా ఆడారి ఆనంద్ కుమార్, ఎంపీ అభ్యర్థి గా బొత్స ఝాన్సీ లక్ష్మీ లకు ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జోరుగా సాగిన ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande