చంద్రబాబు మాయలో పడొద్దు: వైఎస్సార్ సీపీ నేత కృష్ణచైతన్య
శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), మే 6(హిం.స): శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట నియోజకవర్గంపోలాకి మండలం గోల్లలవల
చంద్రబాబు మాయలో పడొద్దు: వైఎస్సార్ సీపీ నేత కృష్ణచైతన్య


శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), మే 6(హిం.స): శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట నియోజకవర్గంపోలాకి మండలం గోల్లలవలస పంచాయతీలో ముమ్మరంగా యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలు చేయని చంద్రబాబు మాయలో పడొద్దని... ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చైతన్య పిలుపునిచ్చారు. సోమవారం పోలాకి మండలం గొల్లలవలస పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చాలాకాలంగా చంద్రబాబు అబద్ధపు మాటలు.. నెరవేర్చని హామీల విని విని విసిగి వేసారి పోయారని.. ప్రజలు ఈ ఆల్ ఫ్రీ చంద్రబాబుని పూర్తిగా నమ్మడం మానేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోని ఓ భగవద్గీతగా భావించి 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం పాటుపడుతున్న ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ మనం గెలిపించుకోవాలని.. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్ ను కూడా ఆశీర్వదించి గెలిపించాలని.. రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలని ఆయన అభ్యర్థించారు.

ఈ సందర్భంగా తోటాడ, గొల్లలవలస చెరువులు వద్ద ఉపాధి పని చేస్తున్న ఉపాధి వేతన దారులు వద్దకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులను వివరించారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande