దిల్లీ, 07 మే (హిం.స)అహ్మదాబాద్: మండుటెండల్లో హోరాహోరీగా సాగుతున్న సార్వత్రిక సమరంలో మరో దశ పోలింగ్కు సర్వం సన్నద్ధమైంది. మూడో విడతలో భాగంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. 1,300 మందికిపైగా అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తమ్ రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్.పి.సింగ్ బఘెల్ కూడా తృతీయ విడత బరిలో నిలిచారు. గుజరాత్, కర్ణాటక, బిహార్, మధ్యప్రదేశ్ల్లో మంగళవారం పోలింగ్ జరగనున్న అన్ని స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాయే దక్కించుకుంది. వాటిని నిలబెట్టుకునేందుకు కమలనాథులు తీవ్రంగా కృషిచేస్తున్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్