న్యూఢిల్లీ మే 7 (హిం.స) ఢిల్లీలోని రవుస్ ఎవెన్యూ కోర్టు హాల్లో నేడు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన
ప్రజ్వల్ రేవణ్ణ అంశాన్ని కవిత ప్రస్తావించారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ మీడియాతో
మాట్లాడిన కవిత... ప్రజ్వల్ రేవణ్ణ లాంటి
వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించారు. కానీ
నాలాంటి వాళ్లను అరెస్ట్ చేశారు. ఇది
అన్యాయం, దీన్ని అందరూ గమనించాలని
పేర్కొన్నారు కవిత. గతంలో తాను కడిగిన
ముత్యంలా బయటకు వస్తానని, ఇది బీజేపీ కక్షసాధింపు చర్య అని పేర్కొన్న కవిత..తాజాగా కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ అంశాన్ని లేవనెత్తారు. జేడీఎస్..బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో.. కవిత ఈ విధంగా స్పందించారు.
రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం