ముచ్చట గా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని
తెలంగాణ రంగా రెడ్డి ఫరూక్ నగర్ మే:7(హిం స) ఇంటింటి ప్రచారం చేసిన బూత్ కమిటీ అధ్యక్షులు మల్లెల ఆనంద్
*ముచ్చట గా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని


తెలంగాణ రంగా రెడ్డి ఫరూక్ నగర్ మే:7(హిం స) ఇంటింటి ప్రచారం చేసిన బూత్ కమిటీ అధ్యక్షులు మల్లెల ఆనంద్ కుమార్, పిల్లి బాబు, మాధగారి మహేష్, ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అలాగే కందివనం గ్రామంలోని చెరువులో ఉపాధి హామీ పథకం పనిచేస్తున్న రైతులతో, మహిళలతో నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలను గత ఐదు సంవత్సరాల నుంచి మీ అందరూ కూడా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా రేషన్ ఇస్తున్నారని అలాగే ఉపాధి పథకంలో 140నుండి 300 రూపాయలకు నరేంద్ర మోడీ పెంచడం జరిగిందని నిరుపేదలకు దేశంలో నాలుగున్నర కోట్ల మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించడం జరిగిందని, సిలిండర్ లేని మహిళలకు 10 కోట్ల మందికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరిగిందని ఈ పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి అరుణమ్మనీ అత్యధిక గెలిపించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్ గుప్తా కొరినారు. ఈ కార్యక్రమంలో మొగిలి గిద్ద శక్తి కేంద్ర ఇంచార్జి పొగుల నర్సింలు, బిజవైఎం నాయకుడు మరిపల్లి ఉదయ్ కుమార్,మైస సురేష్,నారాని శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande