సంగారెడ్డి టౌన్ 07 మే (హిం.స)లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు సైతం కల్పిస్తున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన చోట్ల ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. యువత, మహిళలు, దివ్యాంగులు ఉత్సాహంగా ఓటువేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్