.కొత్తకోట, 08.మే.(హిం.స) రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనుండగా.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, రాయలసీమ ఊటీగా పేరొందిన హార్సిలీహిల్స్లోని ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్ కేంద్రానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ కేంద్రంలో మొత్తం 90 మంది ఓటర్లు ఉన్నారు. రాయలసీమలో తక్కువ సంఖ్యలో ఓటర్లున్న అతి చిన్న పోలింగ్ కేంద్రం ఇది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఇది ఉండగా.. సీమలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తుపై నుంచి స్థానికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్