ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి ప్రభుత్వాన్ని నడిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిల్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషనర్ కు లక్ష రూపాయలు జరిమానా విధింపు
న్యూఢిల్లీ మే 8 (హిం.స)ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి ప్రభుత్వాన్ని నడిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిల్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషనర్ కు లక్ష రూపాయలు జరిమానా విధింపు


న్యూఢిల్లీ మే 8 (హిం.స)ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను నిషేధించాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు. ఈ పిల్ ను కోర్టు తిరస్కరించడమే కాకుండా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

కాగా, శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, కేబినెట్ సభ్యులతో కేజ్రీవాల్ మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని జైలు డీజీని ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం పిటిషన్ను తిరస్కరించి శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాదికి రూ. లక్ష జరిమానా కూది విధించింది. ఈ మొత్తాన్నిఎయిమ్స్ ఖాతాలో జమ చేయాలని పిటిషనర్ను కోరారు. పిటిషనర్ను కోర్టు మందలించడంతో పాటు పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది.ఇక, ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవికి కేజ్రీ వాల్ రాజీనామా, రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకుండా మీడియాను నిలిపివేయాలని పిటిషన్లో శ్రీకాంత్ ప్రసాద్ డిమాండ్ చేశారు. దీనిపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎమర్జెన్సీ విధించాలా లేక మిలటరీ పాలన విధించాలా అని ప్రశ్నించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21వ తేదీ నుంచి జైలులో ఉన్నారు. ఆరోపించిన మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీ వాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని పట్టుదలగా ఉన్నారు. తమ అధినేత సీఎం పదవికి రాజీనామా చేయరని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande