అమరావతి: 08 మే (హిం.స)ప్రభుత్వ పథకాలను నిధులు విడుదల చేయాలంటూ ఏపీ హైకోర్టులో ) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది. లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు కూడా నిధులు నిలిపివేయడం తగదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అయితే నిన్ననే ఈ అంశంపై విచారణ జరిగిందని హైకోర్టు చెప్పింది. బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణను గురువారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయించింది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్