బాచుపల్లి: 08 మే (హిం.స)హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఏడు మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను తిరుపతిరావు (20), శంకర్ (22), రాజు (25), రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు (4), ఖుషిగా గుర్తించారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్