దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి రాకపోకలు
తిరువనంతపురం, 8 మే (హిం.స)భారత్: దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతప
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి రాకపోకలు


తిరువనంతపురం, 8 మే (హిం.స)భారత్: దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది. ఈ రైలు ప్రధానలక్ష్యం పర్యాటకులను ఆకర్షించడం. భారత్ గౌరవ్యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేటు రైలు సర్వీసును నిర్వహించనున్నారు. తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ సహా పలు స్టేషన్లలో రైలును ఆపుతారు. ఇందులో ఏకకాలంలో 750 మంది ప్రయాణం చేయొచ్చు. 2 స్లీపర్క్లాస్ కోచ్లు, 11 థర్డ్క్లాస్ ఏసీ కోచ్లు, 2 సెకండ్క్లాస్ ఏసీ కోచ్లు ఉన్నాయి. వైద్య నిపుణులు సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande