నేడు కాసేపు మాయమైన నీడ .. హైదరాబాదులో మధ్యాహ్నం 12.12 కు శూన్య నీడ ఆవిష్కృతం.
హైదరాబాద్ మే 9 (హిం.స) ఎండలో ఎక్కడికి వెళ్లినా కూర్చున్నా నిల్చున్నా మన నీడ వెన్నంటే ఉంటుంది. ఇక పిల
నేడు కాసేపు మాయమైన నీడ .. హైదరాబాదులో మధ్యాహ్నం 12.12 కు శూన్య నీడ ఆవిష్కృతం.


హైదరాబాద్ మే 9 (హిం.స)

ఎండలో ఎక్కడికి వెళ్లినా కూర్చున్నా నిల్చున్నా మన నీడ వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలైతే నీడతో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన నీడ మాయం అవుతుంది.ఆ విషయం మీకు తెలుసా? అలాంటి అరుదైన సంఘటనే ఇవాళ ఆవిష్కృతం కావడం జరిగింది. గురువారం మిట్ట మధ్యాహ్న సమయంలో కాసేపు మన నీడ ‘మాయం' అయింది! ఇలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. దీన్నే జీరో షాడో డే లేదా శూన్య నీడ అంటారు.ఈ ‘శూన్య నీడ' రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే నిటారుగా ఉండే మనిషి, జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు.

హైదరాబాద్లో ఈ శూన్యనీడ నేడు అనగా గురువారం మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై రెండు, మూడు నిమిషాల వరకూ కొనసాగుతుంది. ఈ విషయాన్ని హైదరాబాద్లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు తెలిపారు. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదని వారు చెప్పారు. అయితే ఆకాశం నిర్మలంగా ఉండడం వల్ల నగరంలో కాసేపు శూన్య నీడ ఆవిష్కృతమైంది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande