సామాజిక న్యాయం మోడీ వల్లే సాధ్యం.. కేంద్రమంత్రి మురుగన్
నాగర్ కర్నూల్ మే 9 (హిం.స)సాధ్యమని, మోడి తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్య
సామాజిక న్యాయం మోడీ వల్లే సాధ్యం.. కేంద్రమంత్రి మురుగన్


నాగర్ కర్నూల్ మే 9 (హిం.స)సాధ్యమని, మోడి తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర ప్రసార,

పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి ఎల్.మురుగన్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంలో 27 ఓబిసి, 12 ఎస్సీ, 10 మహిళా, 9 ఎస్టీ వర్గాల వారికి చోటు కల్పించడమే సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలలో భాజాపా 400 సీట్లు గెలిచి మూడోసారి మోదీనే ప్రధాని కావడం గ్యారెంటీ అన్నారు. మోడీ వల్లే నాగర్కర్నూల్ పార్లమెంట్లో 2 వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఆసియాలోనే అతి పెద్ద,ఇండియాలోనే మొట్టమొదటిగా సోమశిల ఐకాన్,హైవే బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. గద్వాల నుండి దోర్నకల్ రైల్వే లైన్ కొరకు సర్వే చేయించి మంజూరీ కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు.మామిడి పండ్ల ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంజూరు లాంటి అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. మోదీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించారని, అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. 30 సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో పోతుగంటి రాములు నిస్వార్థంగా, సాదాసీదాగా జీవిస్తూ ప్రజలకు సేవలందిస్తూ వచ్చారని, ఆయన వారసుడైన పోతుగంటి భరత్ ప్రసాద్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే అలంపూర్, మున్ననూర్`బూత్పూర్ హైవేలు, గద్వాల నుండి దోర్నకల్ రైల్వే లైన్లతో పాటు ఇక్కడ ఆయుర్వేద యూన్సివర్సీటిని మంజూరి చేయిస్తారని హామీ ఇచ్చారు. 11న చివరి పార్లమెంట్ ప్రచారం ముగింపునకు వనపర్తికి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని, ఆ మీటింగ్కు భాజాపా శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande