హైదరాబాద్ మే 9 (హిం.స)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశా మంచి మనసు చాటుకున్నారు. స్టేడియంలో క్రికెట్ చూడాలనే అనాథల కోరికను ఆమె నెరవేర్చారు. ఎల్బీనగర్లోని ఓ అనాథాశ్రమానికి చెందిన 30 మంది పిల్లలను నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్రైజర్స్ VS లక్నో మ్యాచుకు ఆమె తీసుకెళ్లినట్లు సమాచారం. వారితో కలిసి ఆమె మ్యాచ్ వీక్షించారని, తమ అభిమాన ప్లేయర్లను దగ్గరి నుంచి చూసి పిల్లలు ఎంతో సంబరపడినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నోతో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ విజయంతో సన్రైజర్స్ ప్లేఆఫ్ మెరుగయ్యాయి.
రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్