ఆర్మూరు పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్ కు నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ మే 9 (హిం.స) నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ అధికారులు జీవన్రెడ్డి మాల్కు నేడు
ఆర్మూరు పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్ కు నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ అధికారులు


నిజామాబాద్ మే 9 (హిం.స)

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ అధికారులు జీవన్రెడ్డి మాల్కు నేడు మరోసారి వచ్చారు. 3.14 కోట్ల బకాయిలు చెల్లించాలని వారు జీవన్ రెడ్డి మాల్ కు నోటీసులు జారీ చేశారు. నేటి సాయంత్రం వరకు బకాయిలు చెల్లించాలని.. లేకపోతే మాల్ను మొత్తం తాము స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ డీఎం ఆంజనేయులు తెలిపారు. విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు అద్దె బకాయిలపై నోటీసులు జారీ అయ్యాయి.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande